హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రైలులో తిరుపతికి వెళ్లిన భక్తులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి ఆదిలాబాద్ నుంచి బయలుదేరిన కృష్ణా ఎక్స్ప్రెస్ ఏపీలోని వెంకటగిరి స్టేషన్ సమీపానికి చేరుకుంటుండగా, రైలులో పొగలు రావడం గమనించిన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది.
రైల్వే సిబ్బంది అప్రమత్తమై పరిశీలించడంతో ఏసీ కోచ్ బోగీ బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చాయని గుర్తించి మరమ్మతులు చేశారు. సుమారు అరగంట పాటు రైలును నిలపడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.