మహబూబాబాద్ : దేశంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న సీఎం కేసీఆర్పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. కరోనా వేళా సభలు వద్దని చెప్పింది కేంద్ర ప్రభుత్వమే. సభలు, సమావేశాలు పెట్టేది బీజేపీ వాళ్లేనని ఎమ్మెల్సీ తక్కెళ్లప్లలి రవీందర్రావు బీజేపీపై ఫైర్ అయ్యారు.
బుధవారం మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. బండి సంజయ్ దీక్షల పేరుతో ప్రజలను గుంపులుగా ఉంచింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటిల బుద్ధి మానుకో. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి రైతుల పాలిట దేవుడిగా మారిన సీఎం కేసీఆర్ పై బీజేపీ విమర్శలు చేస్తుంది. ప్రాంతీయ పార్టీల పట్ల దేశంలో ప్రజాదరణ పెరిగింది. ఇకనైనా బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పనులను అభినందించాలని ఆయన సూచించారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.