హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘అదానీ కోసమే ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారు. దేశ సంపదను అదానీకి కట్టబెట్టేందుకే మోదీ తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు’అని టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు రూపొందించిన 2:19 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన 2015 నుంచి 2022 దాకా ఏడేండ్ల కాలంలో అదానీ ఆస్తులు 14 రెట్లు పెరిగాయని ఆధారాలతో సహా ఆయన వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్టను దిగజార్చుతున్న మోదీ.. తక్షణమే తన ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనేక సవరణలు, చట్ట ఉల్లంఘనలు మోదీ చేయటం వల్ల 2015లో అదానీ ఆస్తుల విలువ 75 బిలియన్ డాలర్లు ఉండగా, ప్రస్తుతం 98.2 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు. మోదీ చర్యలతో ప్రపంచ సూచీల్లో భారత ర్యాంకు పడిపోయిందని తెలిపారు. 189 దేశాల జాబితాలో మానవ అభివృద్ధి సూచీ 131వ ర్యాంకు దక్కడం దుస్థితికి నిదర్శనమని వెల్లడదించారు.