జయశంకర్ భూపాలపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షతతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం కాళేశ్వరం శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఉద్యమకాలంలో ఊరూరు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్న నాయకుడు సీఎం కేసీఆర్. అధికారంలోకి రాగానే ఏ రంగానికి ఎంత ప్రాధాన్యతనివ్వాలి అనేది కేసీఆర్కు బాగా తెలుసన్నారు.
తెలంగాణలో తాగు నీటికి, సాగు నీరుకు ఎలాంటి కొరత రాకూడదనే లక్ష్యంతో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా రంగాల్లో 100 శాతం అభివృద్ధిని చూస్తున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.