హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్- 2026)ను రేపు (22వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా 492కేంద్రాల్లో నిర్వహించనున్నారు. సెట్ చీఫ్ కన్వీనర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి ఎస్ కృష్ణఆదిత్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో, 6నుంచి 9వ తరగతుల వరకు మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష కొనసాగుతుందని వెల్లడించారు.