హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు కలిశారు. శుక్రవారం నాడు శ్రీనివాస్గౌడ్తో భేటీ అయిన ఈ నేతలు.. రిటైర్డ్ టీజీవోలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ భేటీలో పాల్గొన్న టీజీవో సంఘం అధ్యక్షుడు మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి నర్సరాజు తదితరులు మంత్రికి తమ ఇబ్బందులు వివరించారు.
తమ సమస్యలను పేర్కొంటూ వినతి పత్రాన్ని అందజేశారు. 35 సంవత్సరాల పాటు తాము ప్రభుత్వానికి సేవలు అందించామని, రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ల సేవలను సరిగా అందకపోవడం బాధాకరమని వాపోయారు. దేశంలోని ధనిక రాష్ర్టాల్లో ఒకటి అయిన తెలంగాణలో పీఆర్సి-20 సంబంధించి ఉద్యోగ పెన్షన ర్ల వేతన చెల్లింపు సక్రమంగా జరిగేలా చూస్తే తమకు చాలా మేలు కలుగుతుందని టీజీవో నేతలు మంత్రికి తెలిపారు.