TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ద్రోణి వాయువ్య రాజస్థాన్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు రాజస్థాన్, సెంట్రల్ మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్నాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. దక్షిణ రాయలసీమ, పొరుగు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని చెప్పింది. తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ ఇంటీరియర్ కర్నాటక, మరాఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి బలహీనపడిందని వివరించింది. ఈ క్రమంలో రాగల మూడురోజుల్ల రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులు వచే అవకేశం ఉందని చెప్పింది. గురువారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ఖమ్మం, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలో వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. శనివారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది వివరించింది. మరో వైపు రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది.