TG Inter Results | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఫస్టియర్లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు 2025 జూన్ 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు సంబంధిత కాలేజీలో పరీక్ష ఫీజు చెల్లించాలి.
ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి