హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) హాల్టికెట్లు నేటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ హాల్టికెట్లను www.tstet.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 12న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్- 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్- 2 పరీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్- 1కు 3,51,468 మంది, పేపర్- 2కు 2,77,884 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయడానికి అవకాశం కల్పించారు.