హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ గ్రేటర్ జోన్ పరిధిలో 340 అద్దె బస్సులకు టీఎస్ఆర్టీసీ టెండర్లను ఆహ్వానిస్తున్నది. అద్దె ప్రాతిపదికన హైదరాబాద్ రీజియన్లో 162, సికింద్రాబాద్ రీజియన్లో 178 బస్సులు వివిధ రూట్లలో నడిపేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. టెండర్ల దాఖలు, నియమ నిబంధనలు, సందేహాల నివృత్తి కోసం గురువారం ఉదయం జూబ్లీబస్స్టేషన్ రెండో అంతస్తులో ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.tsrtc.telangana.gov.in వెబ్సైట్లో పొందుపర్చినట్టు పేర్కొన్నారు.