కాశీబుగ్గ, ఫిబ్రవరి 9 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మిర్చియార్డుకు సోమవారం 10వేల మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి అత్యధికంగా మిర్చి బస్తాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్లు (2 లక్షల 20వేల బస్తాలు) వచ్చినట్టు పేర్కొన్నారు. తేజ రకం మిర్చి 4100 బస్తాలు, వండర్హాట్ 400 బస్తాలు, యూఎస్ 3,413 బస్తాలు, దేశీ, ఎల్లో రకం మిర్చి 50 బస్తాలు, తాలు రకం మిర్చి 500 బస్తాలు వచ్చినట్టు వెల్లడించారు. ధరలు నిలకడగానే ఉన్నట్టు తెలిపారు.