ఖమ్మం : ఖమ్మం(Khammam) జిల్లా మద్దులపల్లి(Maddulapalli) వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు(Private travel bus) బోల్తాపడింది( overturned ). ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా( Injured ), మరో తొమ్మిది మందికి స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.