త్వరలో కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశం
కాలేజీయేట్ కమిషనర్ నవీన్ మిట్టల్తో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు భేటీ
హైదరాబాద్, జూన్6 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన చరిత్రపై త్వరలోనే అన్ని డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, తెలుగు-చరిత్ర విభాగాల అధ్యాపకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనల మేరకు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సోమవారం కాలేజీయేట్ కమిషనర్ నవీన్ మిట్టల్తో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.
డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల అభిప్రాయాలు తీసుకొన్నాక సమగ్రమైన యాక్షన్ప్లాన్ను ప్రకటిస్తామని జూలూరు గౌరీశంకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం 8 ఏండ్లలో జరిగిన ప్రగతి, గ్రామాల చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, మత సామరస్యం, గ్రామీణ పండుగలు, విశిష్టత, పల్లెల్లోని గొప్పగొప్ప వ్యక్తులు, కవులు, కళాకారుల చరిత్రను విద్యార్థులే వర్తమాన చరిత్రకారులుగా మారి అక్షరబద్ధం చేసే ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసే లక్ష్యంతతో పని చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.