దేవరుప్పుల, జూన్ 25 : బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు ఎన్ఆర్ఐల తోడ్పాటు అవసరమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు. అమెరికాలోని డాలస్ నగరంలో గురువారం బీఆర్ఎస్ ఎన్నారై నాయకుడు సత్యం యాదగిరి నాయకత్వంలో పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతున్నదని, దీని తర్వాత గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలకు కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. శ్రేణులను ఉత్తేజపరిచే రీతితో ఎన్నారై సోషల్ మీడియా ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అమలుకాని హామీలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, హైడ్రా దుశ్చర్యలు.. ఇవన్నీ అస్ర్తాలుగా వాడుకొని రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా బజారుకు లాగాలని సూచించారు. అనంతరం ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రగతి టిఫిన్స్ సెంటర్ను ప్రారంభించి, తెలంగాణ ఇంటి వంటలు, హైదరాబాద్ బిర్యానీ, నాటుకోడి ఇక్కడి వారికి తినిపించాలని నిర్వాహకులకు సూచించారు.