సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 29: సిద్దిపేటకు చెందిన కేదార్నాథ్ సేవాసమితి నిర్వాహకులు ఏటా కేదార్నాథ్లో తెలుగింటి భోజనాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా ఇది నిలిచిపోయిం ది. తిరిగి ఈ ఏడాది ప్రారంభించా రు.
కేదార్నాథ్ వెళ్లే ఆహార పదార్థాల వాహనానికి సిద్దిపేటలోని శరభేశ్వర ఆలయ సన్నిధిలో శుక్రవారం పూజా కార్యక్రమం నిర్వహించారు. జెండా ఊపి వాహనాన్ని పంపించారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జడ్పీ చైర్మపర్సన్ రోజారాధాకృష్ణశర్మ, సేవాసమితి ప్రతినిధులు కాచం కాశీనాథ్, శివ్వా శ్రీనివాస్, బుచ్చయ్య, రత్నాకర్, నవీన్కుమార్, శరభయ్య, రాములు, ఆత్మారాములు పాల్గొన్నారు.