హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఈటీ గవర్నమెంట్ డిజిటెక్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్-2023లో తెలంగాణకు రెండు గోల్డ్ మెడల్ అవార్డులు దక్కాయి. గోవా వేదికగా ఈ నెల 4 నుంచి 6 వరకు జరిగిన కార్యక్రమంలో ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి అవార్డులను అందుకొన్నారు. రోడ్డు భద్రత నిర్వహణపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో చేపట్టిన ‘ఐ రాస్తే’కు మొదటి అవార్డు దక్కిందని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.
అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యంపై రూపొందించిన టెక్నాలజీకి రెండో అవార్డు వచ్చిందని వెల్లడించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టులకు జాతీయ స్థాయిలో అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉన్నదని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు.