వేములవాడ/బోయినపల్లి, మార్చి 30: జూనియ ర్ సివిల్ జడ్జీలుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ జ్యు డీషియల్ శాఖ బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో వీరు నియమితులయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన గడ్డం వందన, బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన తడిగొప్పుల ప్రవళిక జూనియర్ సివిల్ జడ్జీలుగా ఎంపికయ్యారు.