హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన ఓ మహిళ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం స్ట్రాత్ఫీల్డ్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సంధ్యారెడ్డి.. అక్కడి లేబర్, లిబరల్ పార్టీల అభ్యర్థులపై ఘన విజయం సాధించారు. కౌన్సిల్లో మొత్తం 10 స్థానాలుండగా, ముగ్గురు లేబర్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఏడుగురు స్వతంత్రులు విజయం సాధించారు. వచ్చే నెల 10న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలున్నాయి. అన్నీ కలిసి వస్తే డిప్యూటీ మేయర్గా సంధ్యారెడ్డి ఎన్నికయ్యే అవకాశం ఉన్నది. ఖైరతాబాద్కు చెందిన పట్లోల్ల శంకర్రెడ్డి, సరళారెడ్డి కూతురు సంధ్యారెడ్డి స్టాన్లీ స్కూల్లో చదువుకొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం 30 ఏండ్ల కిందనే ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె 2020 ఏడాదికిగాను స్ట్రాత్ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.