హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ కేవలం తొమ్మిది ఏండ్లలో అన్నిరంగాల అభివృద్ధిని సాధించింది. వినూత్న పథకాలతో దేశానికే రోల్మాడల్గా నిలిచింది. ఏటేటా ప్రభుత్వం సాధిస్తూ వచ్చిన పలు అభివృద్ధి అంశాలను దశలవారీగా రికార్డు చేస్తూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నాటికి సంపూర్ణ అభివృద్ధిని సీఎం పౌరసంబంధాల కార్యాలయం ఎంతో ఓపికగా క్రోడీకరించింది.
పదేండ్ల ప్రస్థానాన్ని కండ్లకు కట్టింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ‘తెలంగాణ రాష్ట్ర పదేళ్ల ప్రగతి ప్రస్థానం’ పేరుతో దీన్ని విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కృషితో అమలు చేసిన పథకాలు, జరిగిన సమగ్ర అభివృద్ధిపై సమగ్ర సమాచారాన్ని ఇందులో పేర్కొన్నారు. పూర్తి పాఠం www. ntnews.com లో అందుబాటులో ఉన్నది.