మల్లాపూర్, ఫిబ్రవరి 16: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన సురకంటి జగన్ (32) జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతార్కు వెళ్లాడు. అక్కడ అల్ బావాకిర్ యూనికాన్ అనే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా.. 2021లో ఫిఫా వరల్డ్ కప్ కోసం స్టేడియం మరమ్మతుల సందర్భంగా జరిగిన ప్రమాదంలో జగన్ అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే ప్రమాద బీమా అందలేదు. దీంతో
తెలంగాణ వెల్ఫేర్ అసోషియేషన్ ఖతార్ శాఖ అధ్యక్షుడు ఖాజా నిజామొద్దీన్ ప్రత్యేక చొరవ తీసుకొని.. అక్కడి ఇండియన్ ఎంబసీలోని అధికారి నవరతన్ ప్రధాన్ సహకారంతో బాధిత కుటుంబానికి రావాల్సిన ఖతార్ కరెన్సీలో రెండు లక్షల రియల్స్ (అంటే రూ.44 లక్షలు) ప్రమాద బీమా సొమ్మును బాధిత కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఇటీవలే జమ చేయించారు. మృతుడికి భార్య పావని, కుమార్తె రిశ్విక, కుమారుడు రిశ్వంత్తో పాటు తల్లి రాజగంగు, తండ్రి రాజారెడ్డి ఉన్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని బీమా డబ్బులు ఇప్పించిన ఖాజానిజామొద్దీన్కు మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.