హైదరాబాద్, ఏప్రిల్ 4 : తెలంగాణ జలవనరులఅభివృద్ధి సంస్థ (టీడబ్ల్యూఆర్డీసీ) చైర్మన్ వీ ప్రకాశ్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. సోమవారం రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2017 నుంచి టీడబ్ల్యూఆర్డీసీ చైర్మన్గా ఉన్న ప్రకాశ్కు మార్చిలో పదవీకాలం ముగిసింది. తాజాగా మరొకసారి ఆయనను ప్రభుత్వం నియమించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన చైర్మన్గా కొనసాగనున్నారు. దీంతో ఆయన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.