హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): అయోధ్య రామమందిరం పేరును ఉపయోగించి జరిగే మోసాల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఏడీజీ శిఖాగోయెల్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్లు, ఏపీకే ఫైల్స్ పంపి.. ప్రసాదం పంపిణీ చేస్తున్నట్టు, విరాళాలు సేకరిస్తున్నట్టు, దర్శ నం కోసం వీఐపీపాస్లు ఇప్పిస్తున్నట్టు అమాయక భక్తుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. నకిలీ వెబ్సైట్ల ను సృష్టించి, లింక్లు పంపి మోసగించే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల మాయలో పడితే.. 1930 నంబర్కు కాల్ చేయాలని సూచించారు.
కొత్తగా నిర్మితమవుతున్న 14 భరోసా కేంద్రాలపై రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వాటి నిర్మాణ పనులను తెలుసుకొన్నారు. ప్రారంభానికి సిద్ధమవుతున్నట్టు అధికారులు వివరించారు. అత్యాచార బాధితులకు, ఆపదలో ఉన్న ఆడబిడ్డలకు ఈ భరోసా కేంద్రాలు 24 గంటలూ సాయం చేస్తాయని శిఖాగోయెల్ తెలిపారు.