Pending Challans | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చి నా.. పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు వాహనదారులు సుముఖంగా లేరని తెలుస్తున్నది. మొత్తం 3.56 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండ గా.. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు 1.05 కోట్ల చలాన్లు మాత్రమే క్లియర్ అయ్యా యి. ఈ 16 రోజుల్లోనే పెండింగ్ చలా న్ల ద్వారా రూ.113 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఆటోలు, బైక్లకు 80 శాతం, ఆర్టీసీ బస్లకు 90 శాతం, ఇతర వాహనాలకు 60% ప్రభుత్వం రాయితీ ప్రకటించింది.
భారీ స్థాయి లో రాయితీలు కల్పించినందున తామిచ్చిన గడుపులోపే అన్నీ చలాన్లు క్లియర్ అవుతాయని ప్రభుత్వం భావించింది. అయినా ఇంకా సుమారు 2 కోట్ల చలాన్లు పెండింగ్లో ఉండటంతో రాయితీని ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. వాహనదారులు మీసేవ, ఈ-సేవ, టీ వ్యాలెట్, పేటీఎం, టీఎస్ ఆన్లైన్లు, మొబైల్లలో లింక్ ఓపెన్ చేసి చెల్లించవచ్చని తెలిపింది. ఈ చెల్లింపుల్లో ఇబ్బందులొస్తే 040-27852721, 2785 2772 నంబర్లకు కాల్, 8712661 690 నంబర్కు వాట్సాప్ చేయాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు సూచించారు.