హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మూలధన వ్యయంలో, సంపద సృష్టిలో తెలంగాణ దేశానికే ఆ దర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే మూలధన వ్యయంపై సీఎం కేసీఆర్ శ్రద్ధ పెట్టారు. ఫలితంగా అనతికాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తి గా ఎదిగింది. వార్షిక మూలధన వ్య యంలో ఏకంగా 190% పెరుగుదల తో 18 రాష్ర్టాలను వెనక్కి నెట్టి దేశంలో నే అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
2014-15లో రూ.8,097 కోట్లుగా ఉన్న తెలంగాణ మూలధన వ్యయం గత సంవత్సరంలో రూ.18,007 కోట్లకు చేరింది. అంటే.. గత తొమ్మిదేండ్లలో రాష్ట్ర మూలధన వ్యయం రూ.9,910 కోట్లు పెరిగింది. మూలధన వ్యయంలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ 142% వృద్ధితో ద్వితీయ స్థానంలో నిలువగా 87% వృద్ధితో ఓడిశా తృతీయ స్థానంలో నిలిచింది.
కేసీఆర్ పనితీరుకు నిదర్శనం..
మూలధన వ్యయంలో తిరుగులేదని మరోసారి రుజువైంది. దేశంలోని 18 పెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి తెలంగాణ అగ్రగామిగా ఎదడగం హర్షణీయం. సీఎం కేసీఆర్ సమర్థ పాలనకు, సుస్థిర ప్రభుత్వానికి ఇది ప్రబల నిదర్శనం.
– కే తారక రామారావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి