ఖలీల్వాడి (నిజామాబాద్), మార్చి 22: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్తో పాటు హైదరాబాద్కు చెందిన అనేక నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల నిర్మాణ సంస్థలతో పాటు బ్యాంకులు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాయి. పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఇలాంటి ప్రాపర్టీ షోలు ఉపయోగపడతాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని చెప్పారు.
రియల్ రంగంలో అనేక కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం మంచి ప్రయత్నమని కితాబునిచ్చారు. ఆటో షో, ప్రాపర్టీ షోలతో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యం చేస్తున్న ప్రయత్నం అద్భుతమని ప్రశంసించారు. నగర వాసులకు ఇలాంటి కార్యక్రమాలతో దూరభారం, వ్యయ భారం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. హైదరాబాద్లో జరిగే ప్రదర్శనలకు దీటుగా ఇక్కడ కూడా ప్రాపర్టీ షో జరుగుతుండటం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. ప్రాపర్టీ షోలో యూబీఐ రీజినల్ హెడ్ శంకర్ ఇబ్రమ్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ ఎం శ్రీకాంత్, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ప్రకటనల విభాగం ఏజీఎం మొగుల్ల రాజిరెడ్డి, మేనేజర్ కడారి శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకున్న సంస్థలను మాత్రమే ప్రదర్శనకు అనుమతించాం. ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంట్లు, ఫర్నిచర్, సోలార్ తదితరాల సమాచారమంతా ఒకే దగ్గర లభించేలా ఏర్పాట్లు చేశాం. 20 లక్షల విలువైన ఓపెన్ ప్లాట్ల నుంచి 3 కోట్ల విలువైన విల్లాల వరకు ప్రదర్శనలో ఉంచాం. తక్షణమే రుణాలి చ్చేందుకు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉన్నా యి. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేపై ఉన్న నమ్మకాన్ని గుర్తుచేస్తున్నది.
– ఎన్ సురేందర్రావు, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్