TS TET | తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యూకేషన్ కమిషనర్, టెట్ చైర్మన్ తెలిపారు. ఈ నెల 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10 వరకు టెట్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. ఇవాళ టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్కు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ-2024ను ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 4వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. జులై 17 నుంచి 31 వరకు డీఎస్పీ పరీక్షలు జరుగనున్నాయి.