హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్టికెట్లు ఈ నెల 11న విడుదల కానున్నాయి. టెట్ వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్లోడ్చేసుకోవచ్చు. ఈసారి టెట్కు 1.66 లక్షల మంది దరఖాస్తు చేశారు. పేపర్-1కు 46 వేలు, పేపర్-2కు 1.03 లక్షలు, రెండు పేపర్లకు కలిపి 16 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షలను ఈ నెల 18 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు పరీక్షలను నిర్వహిస్తారు.