హైదరాబాద్: తెలంగాణ పీజీఈసెట్ షెడ్యూల్ను సవరించారు. పీజీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్లో జరుగుతుందని తెలిసిందే. ఈ ప్రక్రియ గడువును మరింత పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ధ్రువపత్రాల అప్లోడ్ గడువును ఈ నెల 25 వరకూ పొడిగించారు.
ఈనెల 29, 30 తేదీల్లో పీజీఈసెట్ వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. నవంబరు 3న ఎంటెక్, ఎంఫార్మా, ఎంఆర్క్ సీట్ల కేటాయింపులు జరుగుతాయి. నవంబరు 15 నుంచి ఎంటెక్, ఎంఫార్మా, ఎంఆర్క్ తరగతులు ప్రారంభం కానున్నాయి.