హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఇజ్రాయెల్ దేశంలో తకువ నీటి వనరులు, కొద్దిపాటి భూముల్లో ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తూ అధిక ఉత్పాదకత, నాణ్యతను సాధిస్తున్నారని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బీ నీరజాప్రభాకర్ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ హనుమంతరావు ఆధ్వర్యంలో పలు జిల్లాల వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి బాధ్యులు, శాస్త్రవేత్తలు మూడు రోజులుగా ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్లో పాలిహౌస్ల్లోని కూరగాయల నాణ్యత, ఉత్పాదకత ప్రపంచానికి ఆదర్శమని వీసీ చెప్పారు.