హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్కు ఎక్స్ఆఫీషియో చైర్పర్సన్గా హోంమంత్రి వ్యవహరిస్తారు. కమిషన్ సభ్యులుగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ఎన్ ఆనందరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించారు. డీజీపీ ఎక్స్అఫీషియో సెక్రటరీగా, మరో ముగ్గురు రాజకీయేతర పౌరులను నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొనారు. అదనంగా మరో ముగ్గురు ప్యానల్ సభ్యులు సెక్యూరిటీ కమిషన్లో ఉంటారు. ప్యానల్ సభ్యులుగా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావును, ప్రముఖ జర్నలిస్టు, తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్రెడ్డిని నియమించారు.