IAS Officers Transfers | తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న చిత్రా మిశ్రాను ఏటూరునాగారంలోని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బదిలీ చేశారు. ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంకిత్ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేశారు.
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న ఖుష్బూ గుప్తాను ఉట్నూర్ ఐటీడీఏ అధికారిగా ట్రాన్స్ ఫర్ చేశారు. లాంగ్ లీవ్ తర్వాత వచ్చిన ఉట్నూర్ ఐటీడీఏ అధికారి చాహత్ బాజ్ పాయిని తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.