హైదరాబాద్ : ప్రముఖ ఫొటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మృతి పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. భరత్ భూషణ్ అద్భుతమైన చిత్రకారుడు, ఫొటో జర్నలిస్ట్ అని తన జీవితాంతం వృత్తి కోసం పరి తపించారని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక ఘట్టాలను ప్రపంచానికి గొప్పగా చూపించారని గుర్తు చేసుకున్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం భరత్ భూషణ్కు అండగా నిలబడిందన్నారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.