తెలుగు యూనివర్సిటీ, మార్చి 31: తెలంగాణ సారస్వత పరిషత్తు బాలల కథ సంకలనాలకు ఎంపిక చేసిన కథలను ప్రకటించింది. ఇటీవల పరిషత్తు పత్రిక ప్రకటన ద్వారా ఆహ్వానించిన మేరకు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు పలు ఇతర ప్రాంతాలకు చెందిన రచయితలు, రచయిత్రులు 317 కథలు పంపగా అందులో ప్రముఖ రచయితలు, రచయిత్రులు రాసిన కథలు 256, బాలల కోసం బాలలు రాసిన కథలు 61 ఉన్నాయని, వాటిని న్యాయ నిర్ణేతల సంఘం పరిశీలించి ప్రముఖ రచయితలు, రచయిత్రులు రాసిన 86 కథలు, బాలల కోసం బాలలు రాసిన 31 కథలతో కలిపి మొత్తం 117 కథలను ఎంపిక చేసినట్లు తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య ప్రకటనలో పేర్కొన్నారు.