హైదరాబాద్ : విద్యార్థులు, అధ్యాపక, ఉపాధ్యాయ లోకానికి మొత్తం సాహిత్య లోకానికి కరదీపిక తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర అని రాష్ట్ర భాషా సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు, తెలుగు సాహిత్యం అధ్యయనానికి తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర ఒక దారిదీపంలా దారి చూపుతుందన్నారు. మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరీ గౌరీ శంకర్తో కలిసి తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఎదురుచూసిన సమగ్ర సాహిత్య చరిత్ర 715 పేజీలతో ఈ మహాగ్రంథంలో నిక్షిప్తమైందని ఆయన తెలిపారు. ఈ గ్రంథంలో 50 మంది రచయితలు పూర్వయుగం తొలిపాలకులు, వేములవాడ చాళుక్యులు నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమ సాహిత్యం వరకు ఈ గ్రంథంలో నిక్షిప్తం చేశారని పేరొన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత 1 నుంచి 10 తరగతుల వరకు పాఠ్య పుస్తకాల సిలబస్లలో తెలంగాణ అస్తిత్వం చోటు చేసుకుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరీ గౌరీశంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత సాహిత్య చరిత్రలో జరిగిన అన్యాయాల తొలగింపునకు సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ముమ్మర యత్నాలు ప్రారంభించారని తెలిపారు. అందులో భాగమే తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురిస్తున్న ప్రస్తుత బృహత్ గ్రంథాన్ని ప్రచురించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి మామిడి హరికృష్ణ, గ్రూప్-1 అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, కాళోజీ పురసార అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ప్రముఖ సాహిత్య విమర్శకులు కెపి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.