హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గడ్డ గర్వించదగ్గ గొప్ప సా హితీవేత్తల్లో మహామహోపాధ్యాయుడు రవ్వా శ్రీహరి ఒకరని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ శ్లాఘించారు.
శ్రీహరి రాసిన 8 వేల పేజీల రచనలను త్వరలో సంపుటాలు గా ప్రచురిస్తామని చెప్పారు. సోమవారం నాగోల్లోని ఎస్వీ హోటల్లో శ్రీహరి సంస్మరణ సభలో గౌరీశంకర్ మాట్లాడారు. తెలుగు, సంస్కృత మాండలిక పదకోశాల రూపంలో శ్రీహరి వేల పేజీల రచనలను తె లుగు జాతికి అందించారని తెలిపారు.