హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ ఆర్టీసీ రెండు స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే టీ-24 టికెట్ ఇస్తున్న సంస్థ.. తాజాగా టీ-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను తీసుకొచ్చింది. వీటి పోస్టర్లను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం హైదరాబాద్లోని బస్భవన్లో ఆవిషరించారు. ఈ టికెట్లు శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల వద్ద లభిస్తాయి.
మహిళలు, సీనియర్ సిటిజన్లు రూ.50 చెల్లించి టీ-6 తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 6 గంటలపాటు ఎకడి నుంచి ఎకడికైనా ప్రయాణించవచ్చు. మధ్యా హ్నం 2 గంటల తర్వాత ఈ టికెట్లను ఇవ్వ రు. టికెట్ తీసుకొనే సమయంలో వృద్ధులు వయసు ధ్రువీకరణకు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వారంతాలు, సెలవు దినా ల్లో కుటుంబసభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా రూ.300తో ఫ్యామిలీ-24 టికెట్ తీసుకొని నలుగురు రోజంతా సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు.
శని, ఆదివారాలతోపాటు సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఇప్పటికే అమలులో ఉన్న టీ-24 టికెట్లను 55.50 లక్షల మంది కొనుగోలు చేశారు. ప్రతి రోజు సగటున 25 వేల వరకు ఆ టికెట్లు అమ్ముడవుతున్నాయి. కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వీ రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పీవీ మునిశేఖర్, వినోద్కుమార్, వెంకటేశ్వర్లు, సీపీఎం కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, సీటీఎం (ఎంఅండ్సీ) విజయ్ కుమార్, సీఎఫ్ఎం విజయ పుష్ప, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్ఎంలు వరప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.