థర్డ్వేవ్ తరువాత తొలిసారిగా అత్యధికం
హైదరాబాద్, జూలై27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుధవారం 852 కరోనా కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ తరువాత ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 36,764 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 852 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం 4,915 మంది రోగులు ఐసోలేషన్లో ఉన్నారని పేర్కొన్నది. 640 మంది కరోనా నుంచి కోలుకొన్నారని, రికవరీ రేట్ 98.89శాతంగా ఉన్నదని వెల్లడించింది.