హైదరాబాద్ : తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతున్నది. ఇటీవల వరుసగా రోజు రోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండగా.. తాజాగా రెండువేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,606 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. కొత్తగా 285 మంది బాధితులు కోలుకోగా.. మరో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,92,357కు పెరిగింది.
ఇందులో 6,76,136 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,041 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.58శాతంగా ఉందని, రికవరీ రేటు 97.65శాతంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులున్నాయని, ఇవాళ ఒకే రోజు 73,156 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,583 కేసులు రికార్డయ్యాయి.