మంత్రి ఎర్రబెల్లి దయాకర్
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలకు త్వరలోనే నిధులను విడుదల చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. కేంద్రం సకాలంలో ఇవ్వకపోవటం వల్లనే పంచాయతీలకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నదని చెప్పారు. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి నేతృత్వంలో పలువురు సర్పంచ్లు బుధవారం బంజారాహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నదని చెప్పారు.