హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : కామన్ బోర్డు పరీక్షా ఫీజులు ఒకే తరహాలో ఉండేలా చూడాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ శ్రీనగర్కాలనీలోని తన నివాసంలో మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
పాఠశాలల్లోని విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు పలు జిల్లాల్లో డీసీఈబీలు వేర్వేరుగా ఫీజులను వసూలు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కావున, కామన్ ఫీజులుండేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చినవారిలో ట్రస్మా రాష్ట్ర నాయకులు ఎన్ఎన్ రెడ్డి, మానాల ప్రభాకర్రెడ్డి, కోడి శ్రీనివాసులు, పగడాల జలందర్రెడ్డి, జీవీ రావు, మిరియాల దుర్గాప్రసాద్, మట్ట చెన్నయ్య, గిరిధర్, ప్రభాకర్రెడ్డి, అజీజ్ తదితరులు ఉన్నారు.