హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి లిఫ్ట్ స్కీమ్ ఫేజ్-2 విస్తరణ పనులను వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు.
ఏపీ చర్యలను ఆక్షేపించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ర్టాలు ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టినా, వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని విస్తరించినా ముందుగా కేఆర్ఎంబీ నుంచి లేదా అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.