హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : విద్యుత్ సవరణ బిల్లు-2025ను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌద వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో అన్ని రకాల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, స్మార్ట్ మీటర్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా, రత్నాకర్రావు, శ్రీధర్, బీసీ రెడ్డి, సదానందం, వెంకన్నగౌడ్, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.