Rave Party | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్పార్టీ కేసుపై తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో అధికారులు దృష్టి సారించారు. బెంగళూరు పోలీసుల సహకారంతో ఆ పార్టీలో పాల్గొన్న వారి పేర్లు, వివరాలు తీసుకున్నట్టు తెలిసింది. ఆ రేవ్పార్టీలో ఎకువ మంది తెలుగువారు ఉండటం, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలోనూ వారే అధికంగా ఉండటంతో తెలంగాణ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ రేవ్పార్టీకి డ్రగ్స్ ఎవరు సప్లయ్ చేశారు? వారి వెనుక ఎవరున్నారు? వారి మూలాలేంటి? అనే దానిపై దృష్టి పెట్టారు.
రేవ్పార్టీలో 86 మందికి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ రాగా.. వారిలో 10 మంది వరకు డ్రగ్ పెడ్లర్స్ ఉన్నట్టు బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో డ్రగ్స్ మూలాలపై ఇరు రాష్ర్టాల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చినవారికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారని తెలిసింది బెంగళూరు రేవ్పార్టీ కేసులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వాహనాన్ని ఉపయోగించిన వ్యక్తిని పూర్ణారెడ్డిగా పోలీసులు గుర్తించారు. రేవ్పార్టీలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖులే ఎకువగా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.