హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి అమిత్ షా ప్రసంగం వీడియోను మార్ఫింగ్ చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్టు సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత తెలిపారు. నిందితులు టీపీసీసీ సోషల్ మీడియా యూనిట్ ప్రతినిధులు పెం డ్యాల వంశీకృష్ణ, మన్నె సతీశ్, పెట్టం నవీన్, అస్మ తస్లీమా, కోయ గీతను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని వెల్లడించారు.
నిందితుల నుంచి 5 సెల్ఫోన్లు, ట్యాబ్, 2 ల్యాప్టాప్లు, 2 సీపీయూలను స్వాధీనం చేసుకున్నామన్నారు. బెయిల్ పొందిన వెంటనే ఐదుగురు అజ్ఞాతంలోకి వెళ్లా రు. అమిత్షా స్పీచ్ వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ సైబర్క్రైమ్ పోలీసులు స్పిరిట్ అఫ్ తెలంగాణ ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్న అరుణ్రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇతడు జాతీయ కాంగ్రెస్ సోషల్మీడియా కోఅర్డినేటర్గా పనిచేస్తున్నాడు.