హైదరాబాద్: భారీ వర్షాల (Heavry rains) దృష్ట్యా ప్రజలకు పోలీసులు (Telangana Police) హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దంటూ రాచకొండ పోలీసులు (Rachkonda Police) సూచించారు. కాలువలు, కల్వర్టులు దాటేందుకు ప్రయత్నించవద్దని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలని సూచించారు.
చెట్ల కింద, శిథిలమైన గోడల పక్కన ఉండవద్దని తెలిపారు. నీటి ప్రవాహాలు ఉన్న కొత్త దారిలో వెళ్లొద్దని సూచించారు. పిల్లలను వర్షపు నీటిలో ఆడుకునేందుకు పంపొద్దని కోరారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. కాగా, వర్షాలు తగ్గే వరకు వర్క్ఫ్రం హోమ్ విధానంలో పనిచేసుకోవాలని హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు పోలీసులు సూచించారు. ఆఫీసులకు వెళ్లేట్టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వర్షాల వేళ ప్రజలు ఇండ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని ట్రాన్స్కో సీఎండీ రఘుమారెడ్డి (TRANCO CMD Raghuma Reddy) సూచించారు. విద్యుత్ పరికరాలకు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, భవనాల సెల్లార్లలో నీరు చేరితే తమకు సమారం అందించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే 1912, 738207214, 7382072106, 7382071574 నంబర్లలో ఫిర్యాదు చేయోచ్చని తెలిపారు. విద్యుత్ సమస్యలను వాట్సప్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా కూడా చెప్పవచ్చని వెల్లడించారు.