తెలంగాణ పోలీసు అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న గంటా వెంకట్రావు ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో సత్తా చాటారు. మార్చి 18వ నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగిన ఈ పోటీల్లో 55 ఏండ్లు పైబడిన వారి విభాగంలో ఆడి రెండు కాంస్య పతకాలను గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన్ను అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ అభినందించారు.
గంటా వెంకట్రావు గత 25 ఏండ్లుగా నిరంతర సాధనతో బ్యాడ్మింటన్ ఆటకు, పోలీస్ డిపార్ట్మెంట్కు ఎంతగానో సేవ చేస్తున్నారు. 1991 బ్యాచ్లో ఎస్సైగా రిక్రూట్ అయిన వెంకట్రావు ఉత్తమ అధికారిగా పలుమార్లు కేంద్ర, రాష్ట్ర పతకాలను సాధించారు. ఖమ్మం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర బ్యాడ్మింటన్ సెక్రటరీగా సేవలు అందిస్తూ.. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్లో కూడా ఎన్నో మెడల్స్ను అందుకున్నారు. 2017 లో కేరళలో జరిగిన ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నారు.