హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): దేశంలో మత ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు 125 అడుగుల అంబేదర్ మహా విగ్రహం స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రముఖ కవులు, రచయితలు పేర్కొన్నారు. తెలంగాణా సాహిత్య అకాడమీ కార్యాలయంలో గురువారం వనపట్ల సుబ్బయ్య రాసిన ‘మా అక్షరం, ఆయుధం, అంబేదర్’ దీర్ఘకవితను అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రముఖ కవులు, రచయితలు, సాహితీ విమర్శకుల మధ్య ఆవిషరించారు.
చరిత్రలో అపురూప ఘట్టం
స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాట్యూ ఆఫ్ ఫ్రాటర్నిటి, స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి అంబేద్కర్ విగ్రహం ప్రతీక అని శాసనమండలి సభ్యుడు, కవి, గాయకుడు, దేశపతి శ్రీనివాస్ వివరించారు. 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని రాష్ట్రప్రభుత్వం నెలకొల్పడమన్నది చరిత్రలో అపురూప ఘట్టమని చెప్పారు. అణగారినవర్గాల నుంచి వచ్చిన అద్భుతమైన కవి వనపట్ల సుబ్బయ్య అంబేద్కర్పై దీర్ఘకవిత రచించారని ప్రశంసించారు.
అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా
జాతీయోద్యమ కాలంలోనే దేశానికి స్వతంత్రం వస్తే దళిత, బడుగువర్గాలకు సంపూర్ణ స్వాతంత్య్రం లభిస్తుందా? అని అంబేదర్ అడిగిన ప్రశ్నలు నేటికి కూడా ప్రశ్నలుగానే మిగిలాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలురు గౌరీశంకర్ చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా..రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకాన్ని పెట్టటమే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లల చదువులకు 1,073 గురుకుల పాఠశాలలు స్థాపించిందని పేరొన్నారు. హైదరాబాద్ నగరంలో దేశంలో మతతత్వాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు సాగే శక్తులకు విశ్వరూపంగా 125 అడుగుల విగ్రహం రూపొందిందని తెలిపారు. వనపట్ల సుబ్బయ్య రాసిన దీర్ఘకవిత ప్రేరణ కలిగించే గొప్ప కవితాయుధమని ప్రశంసించారు. అంబేదర్ విగ్రహం, ఆయన చూపుడు వేలుపై స్పందించిన కవులు ఇప్పటికి 250 కవితలు రాశారని తెలియజేశారు.
జాతికి అంకితం చేస్తున్న అంబేదర్ విగ్రహానికి సంబంధించిన తొలి దీర్ఘకవితను వనపట్ల సుబ్బయ్య రచించారని పేర్కొన్నారు. భాషా సాంసృతికశాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, తెలంగాణాలో అంబేదర్ మహావిగ్రహావిషరణ సందర్భంగా వనపట్ల సుబ్బయ్య అంబేదర్పై దీర్ఘకవిత రాయటం అభినందించదగిన పరిణామమని చెప్పారు. అంబేదర్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా ప్రకటించాలని ప్రముఖ విమర్శకుడు, కవి జిలకర శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్, కవయిత్రి జూపాక సుభద్ర, ప్రముఖ కవులు కోయి కోటేశ్వరరావు, సైబాబా, రాపోలు సుదర్శన్, సుంకర రమేశ్, రేడియం, కందికండ మోహన్, ఎదిరేపల్లి కాశన్న, మద్దిలేటి, దినకర్, రవిప్రకాష్, వాగ్గేయకారులు సంగీతపు రాజలింగం తదితరులు పాల్గొన్నారు.