Petrol | పెట్రోల్, డీజిల్ కొరతతో రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. సోషల్మీడియాలో వస్తున్న ప్రచారాలతో తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అనవసరంగా పెట్రోల్ బంకులను పరుగులు తీస్తూ, ట్యాంకులు నింపుకుంటున్నారని తెలిపింది.
ఈ భయాందోళనల కారణంగా సాధారణ స్థాయి కంటే 2.5 నుంచి 3 రెట్లు అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంధన నిల్వలు తగ్గినట్లు కనిపిస్తున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టంచేసింది. HPCL, IOCL, BPCL సంస్థల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని.. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుందని తెలిపింది.
పెట్రోల్ లేదా డీజిల్ను క్యాన్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని.. ఇది PESO నిబంధనలకు విరుద్ధమని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఇంధనాన్ని తప్పుగా నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం తెలిపింది. భయాందోళనలతో అధికంగా ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించింది.

Petrol Dealers Associations