Telangana | హైదరాబాద్ : తమ గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వివిధ హోదాల్లో పేర్లు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల సీహెచ్సీ నర్సులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ సీహెచ్సీలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఇకనుండి స్టాఫ్ నర్స్ని నర్సింగ్ ఆఫీసర్గా, హెడ్ నర్స్ని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ వన్ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్గా మార్చడం సంతోషంగా ఉందన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం సీఎం కేసీఆర్తో మాత్రమే సాధ్యమైందని పేర్కొన్నారు.
వైద్యరంగంలో ఎన్నో మార్పులు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ వృత్తిని గుర్తించి, తమ గౌరవం పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నామని తెలిపారు. తమ కష్టానికి తగ్గ ఫలితంగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని నర్సులు స్పష్టం చేశారు.