ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గుట్టలపై నుంచి జాలువారుతున్నది. ఈ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నది.
బొగత జలపాతం పరవళ్లు తొక్కుతుండటంతో పెద్ద సంఖ్యలో జనాలు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. జలపాతంలో స్నానం చేస్తూ సేద తీరుతున్నారు. వంటావార్పు చేసి, సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.
– వాజేడు